ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 08:45 PM

ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం నాడు సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ కార్పొరేషన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక హోల్డింగ్ కంపెనీ తరహాలో పనిచేయనుంది.రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, అంతర్గత జలరవాణా, గిడ్డంగులు అనే ఐదు కీలక రంగాలను ఏపీ-లింక్ అనుసంధానిస్తుంది. తద్వారా లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు, ఈ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం దీని ప్రధాన బాధ్యత. రాష్ట్రంలోని లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు, సమన్వయం, పర్యవేక్షణకు ఏపీ-లింక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.ఈ కార్పొరేషన్‌కు ఒక మేనేజింగ్ డైరెక్టర్ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, ఒక సలహా కమిటీ ఉంటాయని ఐ అండ్ ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల అమలు కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీ-లింక్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అన్ని రంగాలకు అవసరమైన లాజిస్టిక్స్ సేవలను సమన్వయంతో అందించాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa