తుపాన్ల ప్రభావం, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని వైయస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్) ఎంవీయస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ పనులు పక్కనపెట్టి రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపక్ష నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆయన మండిపడ్డారు. దేశ సగటుకన్నా రాష్ట్ర సగటు సాగు విస్తీర్ణం పడిపోయినా ఈ ప్రభుత్వం మేల్కోవడం లేదని, మొంథా తుపాన్ కారణంగానైతేనేమీ, మద్ధతు ధరలు లేకపోవడం వల్లనైతేనేమీ రాష్ట్రంలో మూడు ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్న రైతులు ఈ ఏడాది రూ.13,324 కోట్లు నష్టపోయారని ధ్వజమెత్తారు. కేవలం పత్తిరైతులే రూ. 9,209 కోట్లు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టమాట, చీనీ, అరటి పంటలకు కనీస మద్ధతు ధరలు కరువై పంటలను రోడ్డుపై పారబోస్తున్న పరిస్థితులు రాయలసీమలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని హెచ్చరించారు. సాధారణ పంటలతో పోల్చితే హార్టీ కల్చర్ సాగు విస్తీర్ణం తక్కువే అయినప్పటికీ జీఎస్డీపీలో మాత్రం మెజారిటీ వాటా పండ్ల తోటలదే అన్న విషయాన్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa