ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన సంస్కృతిని, ప్రకృతిని మనమే కాపాడుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 30, 2025, 01:47 PM

ఆంధ్రప్రదేశ్‌లోని అద్భుతమైన ప్రకృతి అందాలు, అటవీ సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో 'డిస్కవర్ ఆంధ్ర' అనే డాక్యుమెంటరీ తెరకెక్కుతోంది. శ్రీకాంత్ మన్నెపురి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, యంగ్ హీరో నవదీప్ సారథ్యం వహిస్తున్నారు. ఏపీ అటవీ శాఖ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో రూపొందుతున్న ఈ డాక్యుమెంటరీ టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, మన సంస్కృతిని, ప్రకృతిని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. "మన చుట్టూ ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఈ డాక్యుమెంటరీ చూస్తే తప్పక అనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం 2020లో 'గ్రీన్ పాస్' అనే ఎన్జీవో ప్రారంభించాను. నా 'రిపబ్లిక్' సినిమాలో కూడా ఇదే అంశాన్ని చర్చించాం. ఈ డాక్యుమెంటరీకి మణిశర్మ మ్యూజిక్ అందించడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రయత్నాలకు ప్రేక్షకులు, మీడియా మద్దతుగా నిలవాలి" అని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa