జపాన్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ కుదుపు తీవ్రత రిక్టర్ స్కేల్పై సుమారు 7.2గా నమోదైంది. సముద్రం 10 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి.దీంతో జపాన్ ప్రభుత్వం వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర జపాన్ తీరప్రాంతాల అంతటా జాగ్రత్త సూచనలు అమల్లోకి వచ్చాయి. తూర్పు తీరాన్ని తీవ్రంగా కుదిపిన ఈ భూకంపం స్థానిక సమయంలో రాత్రి 9:13 గంటలకు నమోదైంది. ఇది 30 మైళ్లకు పైగా లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. దీనివల్ల హొక్కైడో, అమోరి, ఇవాటే ప్రిఫెక్చర్ల పసిఫిక్ దీవులకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చారు అధికారులు.అయితే, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ఈ భూకంప తీవ్రతను 7.6గా నమోదు చేసింది. సాధారణంగా ఈ స్థాయి భూకంపాలు భవిష్యత్లో జరిగే మరింత పెద్ద కుదుపులకు సంకేతంగా చెప్పబడతాయి. ఇలాంటి భారీ భూకంపాలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం, భవనాల విధ్వంసం, ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సునామీ ప్రభావం ఎంత భయంకరమై ఉంటుందో జపాన్కు చరిత్రే సాక్ష్యం. 2011 టోహోకు భూకంపం–సునామీ ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తులలో ఒకటి. ఆ విపత్తుతో దాదాపు 375 బిలియన్ డాలర్ల నష్టం, సుమారు 20 వేల మంది మరణం సంభవించినట్లు అంచనా. అదే సమయంలో జరిగిన ఫుకుషిమా అణు ప్రమాదం ప్రపంచ అణు ప్రమాదాల స్కేల్లో చెర్నోబిల్తో సమానమైన 7వ స్థాయి రేటింగ్ పొందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa