భిక్షాటనకు పాల్పడుతున్న పాకిస్థాన్ పౌరులపై సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. నేర కార్యకలాపాలు, యాచనను అరికట్టే చర్యల్లో భాగంగా గత కొన్నేళ్లుగా ఒక్క సౌదీ అరేబియానే ఏకంగా 56 వేల మంది పాకిస్థానీ బిచ్చగాళ్లను గుర్తించి దేశం నుంచి బహిష్కరించింది. ఈ షాకింగ్ వాస్తవాలు పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ఇటీవల అక్కడి జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి సమర్పించిన నివేదికతో వెలుగులోకి వచ్చాయి.అక్రమ వలసలు, భిక్షాటనపై ఉక్కుపాదం మోపుతున్న వివిధ దేశాలు 2025 సంవత్సరంలోనే ఇప్పటివరకు 66,154 మంది పాకిస్థాన్ పౌరులను వెనక్కి పంపించాయి. గత ఏడాది ఈ సంఖ్య కేవలం 35 వేలుగా ఉండటం గమనార్హం. ఇలా బహిష్కరణకు గురైన వారిలో 51 వేల మందికి పైగా వర్క్ వీసా, పర్యాటక వీసా, ఉమ్రా వీసాలపై వెళ్లి అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలింది. ఈ ఏడాది సౌదీ అరేబియా 24 వేల మంది పాకిస్థానీయులను, దుబాయ్ 6 వేల మందిని, అజర్బైజాన్ 2,500 మందిని యాచన ఆరోపణలపై బహిష్కరించాయి.ఈ వ్యవహారంపై FIA డైరెక్టర్ జనరల్ రిఫాత్ ముఖ్తార్ మాట్లాడుతూ, "పాకిస్థాన్ నుంచి అక్రమ వలసలు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఐరోపా దేశాలతో పాటు కాంబోడియా, థాయ్లాండ్ వంటి దేశాల పర్యాటక వీసాలను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థీకృత ముఠాల వల్ల అంతర్జాతీయంగా పాకిస్థాన్ ప్రతిష్ఠ దెబ్బతింటోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa