రాయదుర్గంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు నిరసన తెలిపారు. రాష్ట్ర హక్కులను కాలరాస్తూ, ఉన్నత విద్యను విధ్వంసం చేసే ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్–2025’ బిల్లును వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో విద్యకు 10% నిధులు కేటాయించాలని, విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని రక్షించి, సామాజిక న్యాయం హామీ ఇవ్వాలని కోరారు. ఈ బిల్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కలుషితం చేస్తోందని, విద్యను కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ చేస్తూ ఆర్ఎస్ఎస్ హిందూత్వ అజెండాను అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. బిల్లును ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa