ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ ప్రజలకి హెచ్చరికలు జారీచేసిన ఇజ్రాయెల్ సైన్యం

international |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 03:18 PM

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత తీవ్ర రూపం దాల్చిన ఘర్షణలు.. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య భీకర దాడులకు దారితీశాయి. ఈ క్రమంలో, లెబనాన్‌లోని సుమారు 50 గ్రామాల ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం (IDF) సోమవారం హెచ్చరిక జారీ చేసింది.హిజ్బుల్లా ఉగ్రవాదులు తమ సైనిక కార్యకలాపాలను జనావాసాల నుంచే నిర్వహిస్తున్నారని, ఈ కారణంగా సామాన్య పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. గ్రామాలకు కనీసం 1000 మీటర్ల దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు సూచించింది.ఈ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్‌పై విరుచుకుపడ్డాయి. రాజధాని బీరుట్‌తో పాటు దక్షిణ, తూర్పు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. 2024 యుద్ధం తర్వాత బీరుట్ నగరం ఈ స్థాయిలో కంపించిపోవడం ఇదే మొదటిసారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ ఈ దాడులను చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa