తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది మార్చి 19న ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఉగాది రోజునే అమావాస్య ఘడియలు ఉండటంతో ప్రజల్లో పండుగ చేసుకోవచ్చా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే పండితుల అభిప్రాయం ప్రకారం.. మార్చి 19న ఉదయం 6 గంటల 52 నిముషాలకు అమావాస్య ప్రారంభమైనా, అది అంతగా పరిగణించాల్సిన అవసరం లేదని, అందరూ సంతోషంగా దేవునికి పూజలు చేసి ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రతి ఏటా చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa