విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ Infosys తన ఆధునిక ‘గ్రీన్ ఐటీ క్యాంపస్’ను విశాఖలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం నగరంలోని ప్రతిష్టాత్మక ఎండాడ హిల్స్ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అమలులో ఉన్న ‘లిఫ్ట్ పాలసీ’లో భాగంగా ఈ భూమిని ఎకరం 99 పైసలకే లీజు ప్రాతిపదికన Infosysకు కేటాయించారు. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సృష్టించే సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Infosys ఈ గ్రీన్ క్యాంపస్ కోసం సుమారు రూ. 750 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టనుంది. దీనికి అనుబంధంగా ప్రభుత్వం Andhra Pradesh Industrial Infrastructure Corporation (APIIC) ద్వారా రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ. 79 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ క్యాంపస్ను పర్యావరణానికి హాని లేకుండా పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఆధారంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఆరు సంవత్సరాల్లో విశాఖ యువతకు సుమారు 7,000 ఐటీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. స్థానిక ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి సంస్థలో పనిచేసే అవకాశం దొరకడం విశేషంగా భావిస్తున్నారు.Infosys వంటి గ్లోబల్ సంస్థ రాకతో విశాఖ ఐటీ రంగం కొత్త దశలోకి ప్రవేశించనుంది. ఇది ఇతర పెద్ద ఐటీ కంపెనీలను కూడా నగరంపై దృష్టి పెట్టేలా చేస్తుందని అంచనా వేస్తున్నారు. కేవలం పర్యాటక నగరంగానే కాకుండా, రాబోయే రోజుల్లో విశాఖను ఒక గ్లోబల్ ఐటీ హబ్గా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa