దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వయ జనగణన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి జనగణన వివరాలను నమోదు చేశారు. దేశ ప్రగతికి, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు జనగణన అత్యంత కీలకమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానం ద్వారా ప్రజలు సులభంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములై తమ బాధ్యతను నిర్వర్తించాలని ఎమ్మెల్యే సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa