మన తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలో ఫైర్ బ్రాండ్ లాంటి నాయకులున్నారు. వైసీపీలో రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు (ఎందుకోగానీ ఈయనలోని ఫైర్ తగ్గిందని అంటుంటారు), టీడీపీలో సాదినేని యామిని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు ఉన్నారు. మిగతా వారి సంగతి పక్కన పెడతాం. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలో ఫైర్ ఎందుకు తగ్గిందన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయన కొన్నాళ్ల నుంచి మౌనంగా ఉంటున్నారు. ఆయన ఒకప్పుడు టీడీపీపై, చంద్రబాబుపై ఈగ వాలనిచ్చే వారు కాదు. వైసీపీ అధినేత జగన్ పై ఒంటి కాలిపై లేచేవారు. ఎన్నికల ఫలితాల తరువాత ఆయన మౌనవ్రతం పట్టారు. దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇది సోషల్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దీని ఫలితమో, మరేదైనా కారణమో తెలియదుగానీ... ఆయన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయానికి మొన్నీమధ్యన వచ్చారు. జిల్లా అధ్యక్షుడితో కాసేపు సమావేశమయ్యారు. మీడియాతో మాట్లాడ్డానికి మాత్రం ఇష్టపడలేదు.
ప్రస్తుతం వైసీపీ దూకుడుగా ముందుకెళుతోంది. ప్రజావేదికను కూల్చి బాబు నివాసానికి ఎసరు పెట్టింది. ఇంత సీరియస్ వాతావరణంలో కూడా సోమిరెడ్డి మౌనంగా ఉండడం, పార్టీకి/చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అప్పటివరకూ ఎమ్మెల్సీగా ఉన్న సోమిరెడ్డి, ఆ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. అక్కడ ఆ పదవి పోయింది. ఇక్కడ ఈ పదవి దక్కలేదు. ఈ దారుణ పరాభావం నుంచి ఆయన ఇంకా కోలుకోనట్టుంది. ఆయన మౌనవ్రతం వెనుక.. ఓటమే ప్రధాన కారణమా...? మరింకేదైనా కారణముందా...? అది కూడా చూద్దాం. ఇటీవల బీజేపీలో చేరిన టీడీడీపీ రాజ్యసభ సభ్యులతో నెల్లూరు నేతలు టచ్ లో ఉన్నారట. వీరు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa