ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబరు 23న బీసీసీఐ ఎన్నికలు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2019, 02:12 PM

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎన్నికలు ఒక రోజు ఆలస్యంగా జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన అక్టోబర్‌ 22న కాకుండా ఒక రోజు ఆలస్యంగా 23న జరుగుతాయి. హరియాణా, మహారాష్ట్రలలో శాసనసభ ఎన్నికలు అక్టోబర్‌ 21న జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ తెలిపారు. అదే విధంగా రాష్ట్ర క్రికెట్‌ సంఘాల ఎన్నికల గడువును కూడా బీసీసీఐ పొడిగించింది. అక్టోబర్‌ 4లోపు ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa