పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసేందుకు చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో సెప్టెంబర్ 30లోగా ఈ ప్రక్రియను ముగించాలని నిర్ధేశించగా తాజాగా ఆ గడువును డిసెంబర్ 31 వరకూ పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా పాన్ కార్డును ఇంకా ఆధార్తో లింక్ చేసుకోని వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరట ఇస్తోంది. నిర్ధేశిత డెడ్లైన్లోగా పాన్తో ఆధార్ లింక్ కాకుంటే పాన్ కార్డు పనిచేయదు. ఈ క్రమంలో పాన్ను తప్పనిసరిగా పేర్కొనాల్సిన ఆర్థిక లావాదేవీలను కొనసాగించడంలో తమ పాన్తో ఆధార్ను లింక్ చేయని వ్యక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa