ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మాడి సత్యానికి ఘనంగా సన్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2019, 07:34 PM

తూర్పు గోదావరి జిల్లా, కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదం వలన మునిగిపోయిన రాయల్ వశిష్ట పడవని బయటకు తీసినందుకు గాను ధర్మాది సత్యానికి, జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించి రూ.20 లక్షల రూపాయలను అందజేశారు. కాగా ఈ విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ధర్మాడీ సత్యం మరియు అతని బృందం. అయితే కచ్చలూరులో గోదావరి నదిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు మంగళవారం నాడు బయటకు తీశారు. ఈ ప్రయత్నంలో ఎన్నో సార్లు విఫలమైనప్పటికీ కూడా, తన నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా, తన బృందం తో సహా తీవ్రంగా శ్రమించి చివరికి ఆ రాయల్ వశిష్ట పడవను బయటకు తీశారు. ఈమేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ధర్మాడీ సత్యాన్ని ఘనంగా సన్మానించి రూ.20 లక్షలు చెక్కును అందజేశారు. కాగా వీరి ఒప్పందం ప్రకారం పని ప్రారంభించడానికి ముందే 2 లక్షలను అనుడుకున్న ఈ బృందం, నేడు మిగిలిన 20 లక్షల చెక్కును కూడా అందుకున్నారు. కాగా మొత్తం 22.7 లక్షలకు వీరు తమ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa