ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రదాడులు జరగవచ్చు : నిఘా సంస్థలు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 12:56 PM

దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. పిఒకెనుంచి భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం అందడంతో నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీనితో కేంద్ర హోంశాఖ ఢిల్లి స్పెషల్‌ సెల్‌ పోలీసులను అప్రమత్తం చేసింది. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు పరిణామాలతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చునని నిఘావర్గాల హెచ్చరించాయి. ఉగ్రవాదుల టాప్‌ లిస్టులో ఆరెస్సెస్‌ అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయం, నేతలపై ఉగ్రవాదులు గురి పెట్టినట్లు ఆ సంస్థలు పేర్కొన్నాయి. ఢిల్లి ఎన్‌సిఆర్‌, ఎన్‌ఐఎ, సిజిఒ కాంప్లెక్స్‌, పోలీస్‌, ఎన్‌ఎస్‌జి, పారామిలిటరీ శిక్షణా కేంద్రాలు, సిఆర్‌ఎఫ్‌ కార్యాలయాలను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని నిఘా సంస్థలు తెలిపాయి. దీపావళి సందర్భంగా ఢిల్లిలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa