మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ బీజేపీ చేతులు ఎత్తేయడంతో ఆ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఆహ్వానించారు. మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతున్నా విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ పంపిన ఆహ్వానంపై బీజేపీ వెనక్కి తగ్గిం విషయం విదితమే. గవర్నర్ను కలిసిన ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పారు. తమకు సంఖ్యాబలం లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. సరైన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేనను గవర్నర్ ఆహ్వానించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తారో లేదో సోమవారం రాత్రి 7.30లోపు తెలపాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ శివసేనకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa