చంద్రబాబు వలన రాష్ట్రం అప్పుల పాలయ్యిందని విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ పై టిడిపి నేత బుద్ధా వెంకన్న ధీటుగా స్పందించారు. ఇప్పటి వరకూ మేము శుక్రవారం ముఖ్యమంత్రి అనుకున్నాం కానీ మీరే స్వయంగా ఆయన మంగళవారం ముఖ్యమంత్రి అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంటూ హామీలు నెరవేర్చే దమ్ము లేక రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటూ దద్దమ్మ కబుర్లు ఎందుకు విజయసాయి రెడ్డి గారు అంటూ చంద్రబాబు గారి హయాంలో చేసిన అప్పు 1,10,000 కోట్లు అంటే ఏడాదికి 22 వేల కోట్లు. ఐదు నెలల మీ జగన్ గారి పాలనలో చేసినవి 18 వేల కోట్లు. పైగా 2019-2020 బడ్జెట్లో సంవత్సరానికి 48 వేల కోట్ల అప్పులు ప్రతిపాదించారని విన్నామని, ఇప్పుడు చెప్పండి లెక్కల మాస్టారు ఎవరు ఎక్కువ అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారనేది అంటూ మీ దొంగ మొహాలు చూసి బ్యాంకులు ఛీ అంటున్నా, నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు నేను రాసిన తప్పుడు లెక్కే నిజం అంటారా విజయసాయిరెడ్డి గారు అంటూ ప్రశ్నించారు.చంద్రబాబు గారు తలపెట్టిన హైదరాబాద్ రింగు రోడ్డుని వంకర రోడ్డుగా మార్చింది మీ మహామేత విజయసయి రెడ్డి గారు గారు అంటూ రింగు రోడ్డుని అష్ట వంకర్లు తిప్పిందే మీ మహామేత, యువమేత మందీ మార్బలంతో కలిసి ప్రాజెక్టు వ్యయాన్ని 5500 కోట్ల నుండి 35 వేల కోట్లకు మార్చి ఆస్తులు కూడబెట్టిన విషయం మర్చిపోయారా అని తప్పుడు రికార్డులతో నష్ట పరిహారం కొట్టేసి మర్చిపోయా అంటే ఎలా విజయసాయి రెడ్డి గారు. పద్దు పాత పుస్తకాల్లో ఉంటుంది ఒక సారి దుమ్ము దులపండి రాసింది మీరే కదా అని సెటైర్లు వేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa