ఎన్నికల ముందు వైసీపీలో చేరిన సినీ ప్రముఖులకు, పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతూ వస్తున్నాడు. సీఎం జగన్ నామినేటెడ్ పదవులు ఇస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పటికే ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ పదవిని నటుడు పృధ్వీకి కట్టబెట్టగా, లక్ష్మీ పార్వతికి ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ బాధ్యతలు అప్పగించాడు. అయితే గత కొద్ది రోజులుగా ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని అలీకి కట్టబెడుతున్నారని లీకులు వచ్చినా చివరకు అలీకి నిరాశే ఎదురయ్యింది. అయితే సీఎం జగన్ ఆ పదవిని సీనియర్ నటుడు విజయ్ చందర్కి అప్పగించారు. టంగుటూరి ప్రకాశం పంతులు మనవడుగా, ప్రఖ్యాత గాయని టంగుటూరి సూర్య కుమారి మేనల్లుడుగా, సినిమాలలో మంచి ప్రభావం చూపిన విజయ్ చందర్ చాలా రోజులుగా క్రితమే వైసీపీలో చేరి పార్టీకి తన వంతు కృషి చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయనకు ఈ పదవి దక్కడంతో అలీకి షాక్ తగిలిందనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa