ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో నిర్వహించిన విద్యా, మైనార్టీ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలువురి రాజకీయనేతల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు సీఎం జగన్. ఏపీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీపై వస్తున్న రాజకీయ విమర్శలపై ఈ సందర్భంగా జగన్ స్పందించారు. అయ్యా సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్ గారు అంటూ... పవన్పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. పవన్ కల్యాణ్కు ముగ్గురు భార్యలు... నలుగురో ఐదుగురో పిల్లలు కూడా ఉన్నారన్నారు. ఆయన తన పిల్లల్ని ఎక్కడ ఏ మీడియంలో చదవిస్తున్నారని ప్రశ్నించారు. పవన్తో పాటు.. వెంకయ్యనాయడు, చంద్రబాబును తమ పిల్లల్ని ఎక్కడ చదవించారని ప్రశ్నించారు.
ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే మన పిల్లలే నష్టపోతారన్నారు. మన జాతి, మనరాష్ట్రమే నష్టపోతుందన్నారు. మనపిల్లలకు మనం ఇచ్చే అతి గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే అన్నారు సీఎం జగన్. ప్రతీ పేదవాడికి ఆ చదువు చెందాలన్నారు. సఏ పేదింట్లో కూడా ఏ పిల్లాడు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదన్నారు. పిల్లల్ని తల్లిదండ్రులు చిరునవ్వుతో స్కూళ్లకు పంపాలన్నారు. ఏపీ ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందన్నారు. నవంబర్ 14న స్కూళ్లలో నాడు నేడు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల స్కూళ్లంటే... అందులో మొదటిదశగా 15వేల స్కూళ్లో నాడు నేడు కార్యక్రామ నిర్వహిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa