ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని ఉండాలని, అది అమరావతే కావలంటూ రాజధాని ప్రాంత రైతులు చేస్తున్నఆందోళనలు తారాస్థాయికి చేరాయి. తూళ్లూరు, మందడం, వెలగపూడి, కురగల్లు, నీరుకొండ, రాయపూడి, ఉద్దండరాయని పాలెం సహా అన్ని గ్రామాలు నిరసనలతోహోరెత్తాయి. సచివాలయం ముట్టడికి రాజధాని రైతులు ప్రయత్నించగా మరికొందరు పలు ప్రాంతాల్లో చేతుల్లో పురుగుమందు డబ్బాలు పట్టుకొని ఆందోళనకు దిగారు.
ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షల రాజధాని కోసం తమకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే తమ త్యాగాలను గుర్తించ కుండా మోసం చేశారని. అమరావతిని తరలించాలని చూస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా గురువారం రైతులతో పాటు, మహిళలు, విద్యార్థులు, ఇతర ప్రజా సంఘాలు విపక్ష నాయకులు ఆందోళపలో పాల్గొని, మందడం సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన రైతులు వెలగపూడికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఐతే.. ఎక్కడిక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa