ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలోనే సచివాలయం ఉండాలి: విష్ణు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2019, 08:18 PM

 తెలుగుదేశం పార్టీని గందరగోళంలోకి నెట్టేందుకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌ ప్రకటన ప్రజలకు ఉపయోగపడేలా లేదని విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడారు.. అభివృద్ధి వికేంద్రీకరణా? లేక అధికార వికేంద్రీకరణా?అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. జిరాక్స్‌ మిషన్లు, 4 న్యాయవాదుల భవనాలు తప్ప కర్నూలుకు హైకోర్టుతో ఏం లాభమని ఆయన ప్ర‌శ్నించారు.  మిగిలిన రాష్ట్రాన్ని ముంచేయడానికే జగన్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ధ్వ‌జ‌మెత్తారు. రాజధాని నిర్మాణంలో కుంభకోణం జరిగిన‌ప్పుడు.. ఎందుకు నిరూపించట్లేదని నిల‌దీశారు. టీడీపీని ఇబ్బంది పెట్టేందుకే పరిపాన వికేంద్రీకరణ అంటూ వైసీపీ ఎత్తుగడ వేస్తోందని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవన్నారు. సీఎం కార్యాలయం విశాఖలో, మంత్రులు అమరావతిలో ఉంటారా?’ అని ప్రశ్నించారు. అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలనేది బీజేపీ నిర్ణయమని విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa