ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్క‌లు నాటిన మిథాలీరాజ్

national |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2019, 06:51 PM

ఎంపీ సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టీమిండియా వుమెన్ క్రికెటర్ మిథాలీరాజ్ పాల్గొన్నారు. గ్రీన్ ఇండియాలో భాగంగా ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మిథాలీరాజ్.. తిరుమలగిరిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మిథాలీరాజ్.. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, ప్రముఖ క్రీడాపాత్రికేయుడు బొరియా మజుందార్, పారిశ్రామిక వేత్త వాణి కోలాతో పాటు.. నటి కాజల్ అగర్వాల్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మిథాలీ ఛాలెంజ్‌కు నటి కాజల్ వెంటనే స్పందించి.. త్వరలోనే మొక్కలు నాటుతానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. పర్యావరణహితం కోసం మహా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మిథాలీ.. తన వంతు కృషి చేసే అవకాశం ఇచ్చిన ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa