ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులని ఖండించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 03:27 PM

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హింసను 'నరమేధం'గా అభివర్ణించిన ఆయన, ఈ దాడులను ఖండించని వారు అసలు భారతీయులేనా? అంటూ సంచలన ప్రశ్నలు సంధించారు.ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, మతం పేరుతో సాగుతున్న ఈ హింస మానవత్వానికే మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. "బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండించకుండా మౌనంగా ఉన్న రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ దేశంలో కొనసాగే నైతిక హక్కు ఉందా?" అని నిలదీశారు. భారతదేశం సహనానికి, మత సామరస్యానికి ప్రతీక అని, అలాంటి దేశంలో ఉంటూ ఈ దాడులపై స్పందించకపోవడం దేశభక్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.ఇది కేవలం ఒక దేశ సమస్య కాదని, అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాధితుల పక్షాన నిలబడకుండా మౌనం పాటించడం అనైతికమని, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించడమేనని అన్నారు. ఈ దాడులను ఖండించలేని వారిని మనమే దేశం నుంచి బహిష్కరిద్దామని ఆయన పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa