వికేంద్రీకరణ బిల్లుతో పాటు పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం బిల్లులను శాసనమండలి అడ్డుకొవడంతో ఏపీ సీఎం జగన్ ఆగ్రహాంగా ఉన్నారు. దీంతో ఏకంగా తన తండ్రి హాయంలో తీసుకొచ్చిన మండలిని రద్దు చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే మండలి రద్దు విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 58 మంది సభ్యులున్న మండలిలో టీడీపీకి 33 మంది సభ్యులు, వైసీపీ 9 మంది సభ్యుల బలం ఉంది. దీంతో కీలకమైన బిల్లులకు టీడీపీ అడ్డంకిగా మారిందని జగన్ భావిస్తున్నారు. అయితే మండలి రద్దుపై జగన్ నిర్ణయంపై వైసీపీ నేతల్లో కూడ అసంతృప్తి నెలకొంది.
ప్రస్తుతం జగన్ కేబినెట్లో ఉన్న డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మరో మంత్రి మోపిదేవి వెంకటరమణలు కూడ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరితో పాటు పార్టీ నేతలకు చాలా మందికి జగన్ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో సీనియర్ మంత్రులు మండలి రద్దును పునరాలోంచిచాలని జగన్ ను కోరినట్లు సమాచారం. అయితే అందుకు సీఎం జగన్ ఒక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీకి మండలిలో 9 మంది ఉన్నారు. టీడీపీకి చెందిన మరో 5 గురు సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీకి మెజారిటీ ఉండాలంటే మరో 16 మంది ఎమ్మెల్సీలు కావాల్సి ఉంటుంది. 16 మంది ఎమ్మెల్సీలు గనుక వైసీపీలోకి తీసుకువస్తే మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానని జగన్ అన్నారట.
దీంతో సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు రంగంలోకి దిగారట. ప్రస్తుతం 16 మంది రాకపోయినా కానీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆ సమయంలో తమకు మద్దతుగా నిలవాలని టీడీపీ ఎమ్మెల్సీల అడుగుతున్నారట. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు సైతం వైసీపీ నేతలు చేసిన ఆఫర్ కు ఓప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే రేపు ఉదయం కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో మండలి రద్దుపై చర్చించనున్నారు. దీంతో మంత్రిమండలి సమావేశానికి ముందే టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరీ మండలి రద్దుపై వైసీపీ సీనియర్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa