ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి సమక్షంలోనే జాతీయ జెండాకు అవమానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2020, 02:10 PM

గణతంత్ర దినోత్సవం వేళ విశాఖపట్నంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. విశాఖపట్నం నగర వైసీపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి అవంతి శ్రీనివాసరావు హాజరయ్యారు. జెండా వందనం సందర్భంగా పతాక ఆవిష్కరణ చేసిన మంత్రి, అధికారులు జెండా తలకిందులుగా ఉండటాన్ని గమనించలేకపోయారు. తలకిందులుగా ఉన్న జాతీయ జెండానే ఆవిష్కరించి అవమానం చేశారు. పాలకులు, ప్రభుత్వాధికారులే ఇలా చేయటంపై సర్వత్రా చర్చ నెలకొంది. పలువరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa