ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ పే వినియోగదారులకు మరో శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2020, 01:53 PM

ప్రముఖ యాప్ ఫోన్ పే మనకు మరో తీపి కబురును చెప్పింది. వినియోగదారులకు మరో మంచి సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఫోన్ పే లో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే అది మెషిన్ ద్వారా అందించే ఏటీఎం సేవలు కావు. ఫోన్‌పే వినియోగదారులు ఎంపిక చేసిన దుకాణాల వద్ద, నగదు తీసుకోవచ్చు. అయితే, ఒక వినియోగదారుడు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే తీసుకునే వీలుంది. Phonepe యూజర్ ఎవరైనా తమకు క్యాష్ కావాలనుకుంటే Phonepe యాప్ ఓపెన్ చేసి.. అందులో Stores tabపై క్లిక్ చేసి. Phonepe ATM ఐకాన్ పై Click చేయాలి. అప్పుడు మీ సమీపంలో ఏ మర్చంట్ సెంటర్లో డబ్బు తీసుకోవచ్చో చూపిస్తుంది. షాపు దగ్గరకు వెళ్లి మీ ఫోన్ పే యాప్ లో Withdraw బటన్ పై క్లిక్ చేయండి. ఎంత అమౌంట్ అవసరమో Phonepe అకౌంట్లో ఎంటర్ చేసి మర్చంట్ కు ట్రాన్స్ ఫర్ చేయండి. మర్చంట్ తనకు అమౌంట్ రీసివ్ కాగానే.. అంతే మొత్తాన్ని క్యాష్ రూపంలో కస్టమర్ కు అందిస్తాడు. మనీ విత్ డ్రా చేసుకునే క్రమంలో కస్టమర్ లేదా దుకాణదారులకు ఎలాంటి ఛార్జీలు వర్తించవు. ప్రస్తుతం ఈ సేవలను ఫోన్ పే ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa