ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 01, 2020, 08:47 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా... పెద్ద ఎత్తున పెన్షన్ పంపిణీ చేపట్టింది. ఈ పథకం ద్వారా.... రాష్ట్రవ్యాప్తంగా 58.22 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1421.20 కోట్లను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు... స్వయంగా ఇళ్లకు వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు ఇస్తున్నారు. కరోనా కాలం కాబట్టి.... అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. పెన్షన్ల పంపిణీలో 2,37,615 మంది వాలంటీర్లు నిమగ్నమయ్యారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ తెచ్చింది. వాలంటీర్లు... పెన్షన్ ఇచ్చిన తర్వాత... బయోమెట్రిక్ చేయించకుండా... దాని బదులుగా... పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు.


ఏపీలో వాలటీర్ల వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రభుత్వం తెచ్చే పథకాల్ని లబ్దిదారులకు చేరవేయడంలో వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు. లబ్దిదారులు కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా... వాళ్లకు ఏ డౌట్స్ ఉన్నా... లబ్దిదారులను అడిగి తెలుసుకుంటున్నారు. అందువల్ల క్షేత్రస్థాయిలో ఏ సమస్యలూ లేకుండా చక్కగా పరిపాలన సాగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లబ్దిదారులు తమకు రావాల్సిన పథకాల ప్రయోజనాల్ని కచ్చితంగా పొందుతూ అవినీతికి అవకాశం లేకుండా చేస్తున్నారని చెబుతున్నారు.


ఏపీలో ప్రస్తుతం 845 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. శాంపిల్ టెస్టుల విషయంలో వెనక్కి తగ్గకుండా చేయిస్తున్న ప్రభుత్వం... కరోనా కేసుల్ని కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa