చైనాతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశం నుంచి సాధ్యమనంత మేర దిగుమతులు తగ్గించడానికి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రధాని కార్యాలయంలో త్వరలో సమర్పించనుంది. అధికారిక వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. దాదాపు 371 వస్తువుల దిగుమతులపై కఠినమైన ఆంక్షలు విధించనున్నారు. దాదాపు 127 బిలియన్ల విలువైన ప్లాస్టిక్ వస్తువులు, స్పోర్ట్స్, ఫర్నీచర్ వస్తువులు సైతం ఇందులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మందులు, దుస్తులు నిషేధించే వస్తువుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. దేశీయ తయారీ దారులకు ప్రోత్సహకాలు అందించి స్వదేశంలోనే ఆ వస్తువులను తయారు చేయించడానికి ఏర్పాట్లు, చేస్తున్నారు. ఇప్పటికే వ్యాపార వర్గాలతో ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే అత్యధిక 100 రకాల వస్తువులపై టాక్స్ ను భారీగా పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ కరోనా సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సప్లై, చైన్ మెకానిజంపై ఆ ప్రభావం పడి దిగుమతి చేసుకునే వారు భారీ మొత్తం చెల్లించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
చైనా నుంచి భారీగా దిగుమతి చేసుకునే వస్తువులు..
(బిలియన్లలో)
యంత్రాలు, యంత్ర పరికరాలు(12.78)
ఆర్గానిక్ కెమికల్స్(7.53)
మొబైల్ ఫోన్లు, పరికరాలు(5.18)
ఎలక్ట్రానికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు(3.2)
కంప్యూటర్, పరికరాలు(3.04)
ఫెర్టిలైజర్(1.80)
సోలార్ సెల్ లు, సెమీ కండక్టర్లు(1.57)
ఇనుము, స్టీల్ వస్తువులు(1.08)
చైనాకు మనం భారీగా చేసే ఎగుమతులు
(బిలియన్లలో)
ఆర్గానిక్ కెమికల్స్(2.57)
ప్రాసెస్ చేసిన పెట్రోలీయం(2.05)
ఇనుప ధాతువు(1.90)
రొయ్యలు(0.84)
ప్లాస్టిక్, ప్లాస్టిక్ వస్తువులు(0.81)
ఎలక్ట్రికల్ వస్తువులు(0.79)
మిషనరీ(0.73)
కాటన్(0.72)
ఐరన్, స్టీల్(0.49)
గ్రానైట్(0.39)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa