ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ..తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 20, 2020, 11:15 AM

అమరావతి : నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈనెల21న రాయలసీమ ప్రాంతంలోను, 22,23తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాం తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం  ఓర్వకల్లు, మంత్రాలయం, చింతలపూడి, కాకినాడ, ముంచంగిపుట్టు, నాయుడుపేట, కందుకూరు తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కాగా చిత్తూరు జిల్లాలో రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండగా, రాయలసీమ లోని మిగిలిన మూడు జిల్లాల్లో సాధారణంగానే ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa