ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిందే : సుప్రీం కోర్టు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 28, 2020, 11:52 AM

విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వ‌హించ‌కుండా నేరుగా పాస్ చేయ‌డం త‌ప్ప‌ని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.. ఫైనల్ ఇయర్ విద్యార్థినీ, విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండా, తదుపరి తరగతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఆదేశాల మేరకు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయరాదని వివరించింది. అయితే ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు యూజీసీ ప్రకటించిన సెప్టెంబరు 30 గడువును రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వాయిదా వేయవచ్చునని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు యూజీసీతో సంప్రదించి, పరీక్షల నిర్వహణకు తేదీలను ఖరారు చేయవచ్చునని తెలిపింది. మహమ్మారి సమయంలో తగిన తేదీని ఖరారు చేసి, ఫైనలియర్ పరీక్షలు నిర్వహించవచ్చునని పేర్కొంది. అలాగే ఫైనలియర్ ఎగ్జామినేషన్స్ తప్పనిసరిగా నిర్వహించాలని యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలు సరైనవేనని తెలిపింది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa