మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ దగ్గర ఉన్న ఎంజీకేఎల్ఐ (మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్) ప్రాజెక్ట్ ను మంత్రులు హరీశ్ రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కాల్వ పనులను మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మంత్రి హరీశ్ పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు చేసేవారిని ప్రజలే నిలదీయాలన్నారు. మా ఇంజనీర్లు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్నారు. ఈ ఏడాది మహబూబ్ నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రతి పక్షాల కుట్రలు ఇక సాగవని స్పష్టం చేశారు. భూసేకరణకు సహకరించిన రైతులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సారి పంట బాగా పండటంతో రైతులంతా ఆనందంగా ఉన్నారని ఆయన వివరించారు. గత పాలకులు మాటలకే పరిమితమయ్యారని టీఆర్ఎస్ ప్రభుత్వం చేతల్లో చూపిస్తుందన్నారు. ప్రతి పది రోజులకు ఒకసారి జిల్లాలో పర్యటిస్తానని ఆయన మాటిచ్చారు. సాధ్యమైనంత త్వరగా సాగునీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లా నుంచి కరువు ను పారద్రోలడమే తమ లక్ష్యమని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa