మిలీనియం సిటీ కాన్సెప్ట్ భాగంగా రాజమండ్రి, కాకినాడ తిరుపతి, విశాఖపట్నం నగరాలకు దీటుగా గుంటూరును అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు తెలిపారు. శంకర్ విలాస్ ఆర్వోబీపై టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్రస్థాయిలో చర్చి జరిగింది. అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని వైసీపీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తీవ్రంగా స్పందిస్తూ అసత్య ఆరోపణలు తగవన్నారు. ఆర్వోబీ భూసేకరణ 80 శాతం పూర్తయిందని, అవగాహన లేక కోర్టుకు వెళ్లిన వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇందుకోసం నగరపాలక సంస్థ రూ.30 కోట్లు కేటాయించిందన్నారు. సాంబశివ, ఉత్తమ యాడ్స్ నిర్వాహకులు అడ్డగోలుగా హోర్డింగ్ ఏర్పాటు చేస్తుండగా వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని కొంతమంది కార్పొరేటర్లు ఆరోపించారు.వచ్చే ఏడాది మార్చిలోగా అక్రమ హోర్డింగ్లను తొలగిస్తామని కమిషనర్ తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు తన మాట కూడా వినడం లేదని, విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని మేయర్ వారిపై మండిపడ్డారు. 31 డివిజన్ ఏఈ ఫోన్ కూడా ఎత్తడం లేదన్నారు. గతంలో రూ.22 కోట్ల పనులకు అడ్డగోలుగా ఆమోదం తెలిపారని వాటి డేటా కూడా లేదని బిల్లులు ఎలా చెల్లించాలని కమిషనర్ ప్రశ్నించారు. మొత్తం 167 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు మేయర్ తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ఆహ్మద్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్లు షేక్ సజల, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa