ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టికెట్స్ ధరలు పెంచనున్న ఏపీ ప్రభుత్వం ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 08, 2017, 04:07 PM

 టికెట్ ధరలు పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జులై 1వ తేదీ నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమలైన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో టికెట్ల ధరలపై ప్రభుత్వాలు ఇప్పటికే సమీక్ష చేపట్టి మార్పులు చేర్పులు చేసిన తరుణంలో తాము కూడా టికెట్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.


సింగిల్ స్క్రీన్ థియేటర్స్ రూ. 100 (గతంలో రూ.75).


మల్టీప్లెక్సెస్ (ఆల్ క్లాసెస్) రూ. 200 (గతంలో రూ.150), రూ.300 రిక్లైనర్స్ (గతంలో రూ.250).ఆర్థిక శాఖ, హోం శాఖ, రెవిన్యూ శాఖ అధికారులతో సంప్రదింపులు చేపట్టిన తర్వాతే ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ఓ జీవో సైతం విడుదలయ్యే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa