జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ వివాదంలో పడ్డారు. ఈ రోజు గురుపౌర్ణమి సందర్భంగా జంషెడ్ పూర్ లోని సాయిబాబా ఆలయంలో నిర్వహించిన మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువర్ దాస్ కు స్వాగతం పలికే క్రమంలో ఆలయానికి చెందిన ఇద్దరు మహిళలు ఆయన కాళ్లు కడిగారు. ఆలయ మహిళలు ఈ విధంగా చేయడమేంటంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సంఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa