ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ మత్తులో చిక్కుకుని నోటీసులు అందుకున్న వారి పేర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2017, 10:22 AM

టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతున్న వేళ, ఎక్సైజ్ శాఖ నుంచి విచారణను ఎదుర్కోనున్న వారి పేర్లు వెల్లడయ్యాయి. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, నవదీప్, శ్రీనివాసరావు, తనీష్, నందు తదితరులు ఉన్నారు. వీరంతా ఈ నెల 19 నుంచి 27 వరకూ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి వుంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగానే హాజరు కావాలని, రాకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. తాజాగా హీరో రవితేజకూ నోటీసులు వెళ్లినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రవితేజను కూడా 19వ తేదీ నుంచి వారం రోజుల్లోగా విచారణకు రావాలని కోరినట్టు తెలిపాయి. కాగా, రవితేజ సోదరుడు, ఇటీవల మరణించిన భరత్ పేరు కెల్విన్ కాల్ లిస్టులో ప్రముఖంగా కనిపించిందని సమాచారం. ఇక స్వయంగా రవితేజ కస్టమర్ కా ఉండి డ్రగ్స్ వాడితే, ఈ నోటీసులు ఇచ్చారా? లేదా తమ్ముడి డ్రగ్స్ వాడకంపై మరింత సమాచారం కోసం విచారించనున్నారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సివుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa