ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో ఉద్రిక్తత.. మరికాసేపట్లో చక్కాజామ్‌

national |  Suryaa Desk  | Published : Sat, Feb 06, 2021, 12:08 PM

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలతో దేశరాజధాని ఢిల్లీ అట్టుడుకుతుంది. రైతుల ఆందోళనలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనలకు రైతులు పిలుపునిచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు జక్కాజామ్‌ కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి. రెండు నెలలకు పైగా ఉద్యమం చేస్తున్న రైతులు, ఈరోజు వినూత్న రీతిలో మరో దేశవ్యాప్త ఆందోళన చేయనున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
చక్కాజామ్‌ నిర్వహణకు సంబంధించి సంయుక్త కిసాన్ మోర్చా మార్గదర్శకాలు విడుదల చేసింది. రహదారుల దిగ్భందానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ నిరసనలలో అంబులెన్స్, స్కూల్ బస్సులతో పాటు అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తామని పేర్కొంది. చక్కాజామ్‌ పూర్తిగా శాంతియుతంగా జరుగుతుందని రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సాధారణ పౌరులతో ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని ఆందోళనకారులకు సూచించింది సంయుక్త కిసాన్‌ మోర్చా. ఆందోళన ముగియడానికి 1 నిముషం ముందు నిలిచిపోయున వాహనాలన్నీ హారన్ కొట్టి రైతులకు సంఘీభావం తెలపాలని సూచించింది. అన్నదాతకు మద్దతు తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa