ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరంపై కేంద్రం శుభవార్త..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 08, 2021, 02:11 PM

పోలవరం నిధులపై రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. 2022 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారని, నిధుల విడుదలలో ఆలస్యం వల్ల ప్రాజెక్టు పనులపై ప్రభావం పడుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని, నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. ఎంపీ కోరిన అంశాలపై జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదని.. ఆర్థిక శాఖ క్యాబినెట్ నోట్‌లో 2013-14 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే నిర్ణయించిందన్నారు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2017 లెక్కల ప్రకారం అంచనాలను తయారు చేసిందని.. దీనిని పరిశీలించి కేబినెట్ నిర్ణయానికి పంపుతామన్నారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం సవరించిన అంచనాలపై ముందుకు వెళ్తామని నిధులు విడుదల విషయంలో ఎలాంటి సమస్య లేదన్నారు.
ప్రాజెక్టు రియింబర్స్‌మెంట్‌ పద్దతిలో పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి. ఆర్అండ్‌ఆర్‌ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచాలని, దీనిని బట్టి ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది ఆధారపడి ఉంటుందన్నారు. మరో మూడు నెలల్లో స్పిల్వే పనులు పూర్తవుతాయని, కాపర్ డ్యాం తయారైన తర్వాత 41 మీటర్ లెవల్‌లో నీళ్లను నిల్వ చేస్తామన్నారు. . 35 శాతం మంది ప్రజలను అక్కడి నుంచి వేరేచోటికి తరలించామని, మిగిలిన వారికి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. లక్ష ఎకరాల భూమి పోలవరం ప్రాజెక్టులో మునిగిపోతుందని, 41 మీటర్ల లెవల్‌లో నీళ్ళు నిల్వ చేసినప్పుడు నిర్వాసితులు అయ్యే వారికి తొలి విడతలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa