ఓ ఆభరణాల వ్యాపారి ఇద్దరు మహిళల హానీ ట్రాప్ చిక్కుకున్నాడు. మాయ మాటలతో వలలో వేసుకుని.. ఆ తర్వాత అతనికి చుక్కలు చూపెట్టారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వాసాయి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆభరణాల వ్యాపారి దుర్గాసింగ్ రాజుపుత్ వద్దకు ప్రధాన నిందితురాలైన ప్రజక్తా పాటిల్ నగలు తాకట్టు పెట్టేందుకు వచ్చింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆమె మరింత ముందుకు తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే రాజ్పుత్, ప్రజక్తా సన్నిహితంగా ఉండసాగారు. ఫిబ్రవరి 3వ తేదీన రాజ్పుత్ను ప్రజక్తా తన ఇంటికి ఆహ్వానించింది. వారిద్దరు కలిసి ఏకాంతంగా గడిపారు. అయితే రాజ్పుత్ అక్కడి నుంచి బయలుదేరు సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
అదే ఇంట్లోని మరో గదిలో దాక్కుని ఉన్న జ్యోతి ఉపాధ్యాయ అనే మహిళ, ఇద్దరు పురుషులు రాజ్పుత్ అడ్డగించారు. అతడిని బంధించి.. ప్రజక్తాతో అతడు సెక్స్ చేస్తుండగా రికార్డ్ చేసిన దృశ్యాలను చూపించారు. అలాగే అతనిపై దాడి కూడా చేశారు. అతని ఒంటిపై ఉన్న ఆభరణాలను, డబ్బులను దోచుకున్నారు. అలాగే ఆన్లైన్లో రూ. 4,500 ట్రాన్స్పర్ చేసేలా బలవంతం చేశారు. లేకపోతే ఆ వీడియోను అతని కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు.
ఇక, అనంతరం అక్కడి నుంచి రాజ్పుత్ ఇంటికి వచ్చేశాడు. అయితే ఆ తర్వాత నిందితులు అతనికి ఫోన్ చేసి ఇంకా చాలా డబ్బు కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో రాజ్పుత్ పోలీసులను ఆశ్రయించాడు. వాలివ్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులుగా ఇద్దరు మహిళలను వారి ఇళ్ల నుంచి అరెస్ట్ చేశారు. అయితే పురుషులు మాత్రం తప్పించుకున్నారని.. వారి కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇక, అరెస్ట్ చేసిన మహిళలను పోలీసులు కస్టడీకి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa