ఏపీ మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నెర్రజేశారు. ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఎస్ఈసీని బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కూడా కేసులు నమోదు చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు.
ఇకపోతే ఏపీ మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఈసీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ సూచించింది. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. కమిషన్ ప్రతిష్ఠను దిగజార్చేలా దురుద్దేశ ప్రకటనలు ఉన్నాయని.. మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలన్నారు.
ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు బహిరంగ ప్రకటన చేయాలని.. శుక్రవారం సాయంత్రం 5లోపు డెడ్ లైన్ పెడుతూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. దీంతో ఎస్ఈసీ అసంతృప్తి చెందింది. ఇప్పటికే మీడియాతో మాట్లాడేముందు సంయమనం పాటించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa