ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కర్ణాటక సీఎం' కి కరోనా పాజిటివ్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 16, 2021, 03:06 PM

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో శుక్రవారం ఉదయం ఆయనను రామయ్య మెమోరియిల్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన మణిపాల్ ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనికి ముందు ఇవాళ ఉదయం యడియూరప్ప తన నివాసంలో కోవిడ్‌పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు, కోవిడ్ సెకండ్ వేవ్‌తో కర్ణాటకలో కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. గత ఏడాది కూడా యడియూరప్పకు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa