ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 23, 2021, 04:57 PM

భారతీయ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు యశ్వంత్‌పూర్‌-హౌరా రూట్‌ లో నడుస్తాయి. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంతో పాటు పలు స్టేషన్ ‌లలో ఆగుతాయి. 06597 నెంబర్‌ గల రైలు యశ్వంత్‌పూర్‌ నుంచి హౌరా మధ్య ప్రయాణిస్తుంది. ఈ ఏడాది జూన్‌ 24 వరకు ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 9.55 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు హౌరా చేరుకుంటుంది. ఈ రైలు విజయవాడ, విశాఖ స్టేషన్‌లతో పాటు రేణిగుంట, గూడూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస రైల్వే స్టేషన్‌ లలో ఆగుతుంది.


ఇక మరో రైలు (06598) హౌరా నుంచి యశ్వంత్ ‌పూర్‌ మధ్య ప్రయాణిస్తుంది. 2021 ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి మంగళవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12.40 గంటలకు హౌరాలో రైలు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.40 గంటలకు యశ్వంత్‌ పూర్‌ చేరుకుంటుంది. మార్గమధ్యలో విజయవాడ, విశాఖ రైల్వే స్టేషన్‌ లతో పాటు రేణిగుంట, గూడూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస రైల్వే స్టేషన్ ‌లలో ఆగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa