ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపిఎల్‌ కు విరామం పలుకుతున్నా : అశ్విన్‌

national |  Suryaa Desk  | Published : Mon, Apr 26, 2021, 10:07 AM

 ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతున్న ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపిఎల్‌ టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ల మధ్య ఆదివారం మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగిన విషయం విదితమే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయాన్ని సాధించింది. మ్యాచ్‌ అనంతరం అశ్విన్‌ తన విరామ నిర్ణయాన్ని ప్రకటించారు.


ట్విట్టర్‌లో అశ్విన్‌ మాట్లాడుతూ... ' నా కుటుంబ సభ్యులు కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. కాబట్టి ఈ కష్టకాలంలో నేను వారికి అండగా ఉండాలనుకుంటున్నాను. అందుకే ఈ ఐపిఎల్‌ సీజన్‌కు రేపటి నుంచి విరామం పలుకుతున్నాను. ఒకవేళ పరిస్థితులు కుదుటపడితే మళ్లీ ఆడేందుకు తిరిగొస్తా. ధన్యవాదాలు ' అని అశ్విన్‌ పేర్కొన్నారు.


అశ్విన్‌ ట్వీట్‌పై అధికారికంగా స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ' ఈ ఆపద సమయంలో అశ్విన్‌ కుటుంబానికి మా సహకారం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం' అని ట్వీట్‌ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa