ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పన్నెండో తరగతి పరీక్షలు పై కేంద్ర విద్యా మంత్రి సమీక్షా

national |  Suryaa Desk  | Published : Tue, May 18, 2021, 12:22 PM

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభించిన నేపథ్యంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తరగతులు, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యా మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సోమవారం వివిధ రాష్ట్రాల, యూటీల విద్యా శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిపారు. కరోనా కాలంలో భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆయన రాష్ట్రాల సలహాలు కోరారు. సీబీఏస్ఈ, సీఐఎస్ఈ  పన్నెండో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణ కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ విషయంలో రమేశ్‌ పోఖ్రియాల్‌ రాష్ట్రాలు, యూటీల అభిప్రాయాలను కోరారు. పదో తరగతి పరీక్షలను ఇప్పటికే రద్దు చేశారు. పన్నెండో తరగతి పరీక్షలు కూడా రద్దు చేసి 'ఆబ్జెక్టివ్‌ మెథడాలజీ' ప్రకారం ఫలితాలు ప్రకటించాల్సిందిగా కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం కూడా దాఖలయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa