ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంతంగా కొనసాగుతున్న నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2017, 11:04 AM

కర్నూలు: నంద్యాల ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడా చిన్నపాటి గొడవల తప్ప మిగతా అన్ని చోట్లా పోలింగ్‌ ప్రశాంతంగానే జరుగుతోంది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఉదయం నుంచే ఓటర్లు భారీగా బారులు తీరారు. ముఖ్యంగా సమస్యాత్మకంగా ఉన్న బూత్‌‌లలో భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ జరుపుతున్నారు.గోస్పాడు మండలంలో యాళ్లూరును సమస్యాత్మక గ్రామంగా అధికారులు భావించారు. ఈ యాళ్లూరులో 6,201 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం 10 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. కాగా యాళ్లూరులో ఉదయం 9 గంటల వరకు 8.9 శాతం నమోదైందని పోలింగ్ అధికారులు మీడియాకు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa