ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ-17 వీ5 ప్రమాదంలో పారా కమాండో సాయితేజ దుర్మరణం పాలవడం తెలుగు వాళ్లందరినీ కలిచివేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రేగడంకు చెందిన సాయి తేజ అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో సవాళ్లను అధిగమించాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ను మెప్పించి, ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిలో ఒకరిగా ఎదిగాడు. ఆర్మీ పట్ల తనకున్న కమిట్మెంట్ ను తలచుకుని సాయితేజ ఫ్యామిలీ మెంబర్స్తోపాటు గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
బాల్యం నుంచే సైన్యంలో చేరాలన్నది సాయితేజ ఆశయం. రైతు కుటుంబ నేపథ్యంలో నుండి వచ్చిన సాయితేజ తన లక్ష్యాన్ని చేరుకునేందుకు అహోరాత్రులు శ్రమించాడు. 2012లో ఆర్మీ జవాన్గా ఎంపికైన ఆయన మొదట బెంగళూరు రెజిమెంట్లో.. ఆ తర్వాత జమ్మూకశ్మీర్లో పనిచేశారు. అనంతరం పారా కమాండోకి ఎంపికై అనేక కఠిన సవాళ్లను దాటుకుని పారా ట్రూపర్గా ఎదిగారు.
ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా దూసుకెళ్లేలా రాటుదేలాడు సాయితేజ. మెరుపుదాడులు చేయడంలో దిట్టలైన వీరికి సైన్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆకాశ మార్గంలో నేరుగా శత్రుస్థావరాలకే వెళ్లి వారిని మట్టి కరిపించే పారా ట్రూపర్ గా సాయి తేజ చేరడంతో అతడి బంధువులు, గ్రామస్థులు ఎంతో ఆనంద పడ్డారు. తనతో పాటు తన తమ్ముడిని సైతం సైన్యంలో చేరమని ప్రోత్సహించాడు. ప్రస్తుతం ఆయన సిక్కింలో విధులు నిర్వహిస్తున్నారు.
ప్రమాదానికి ముందు భార్య, పిల్లలతో వీడియో కాల్ మాట్లాడిన సాయితేజ.. పిల్లల్నీ చూడాలని ఉందని భార్యకు చెప్పి వీడియో కాల్ మాట్లాడినట్లు భార్య శ్యామల చెప్పింది. తమతో మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఇలా మరణ వార్త వినాల్సి రావడంతో ఆ కుటుంబం విషా సాగరంలో మునిగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa