మయన్మార్లో మిలిటరీ బలగాలు మారణకాండ ను సృష్టి స్తున్నాయి. ఓ మిలిటరీ కాన్వాయ్పై దాడి చేశారనే కోపంతో 11 మంది పౌరులను మిలిటరీ బలగాలు చేతులు కట్టేసి సజీవ దహనం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత మంగళవారం (డిసెంబర్ 7,2021) మయన్మార్ వాయవ్య ప్రాంతంలోని సాగేంగ్ పరిధిలోని డన్ టావ్ గ్రామంలో ప్రభుత్వ బలగాలు విరుచుకుపడ్డాయి. ఓ మిలిటరీ కాన్వాయ్పై దాడి చేశారనే కోపంతో 11 మంది పౌరులను సజీవ దహనం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సజీవ దహనం అయినవారిలో కొందరు యువకులతో పాటు మొత్తం 11మంది మృతదేహాలు కాలిపోయి..వృత్తాకారంలో పడి ఉన్నాయి. వారంతా 14 నుంచి 40 ఏళ్లవారిగా తెలుస్తోంది. 2020 ఫిబ్రవరిలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి.. అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం ప్రజలపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న వారిని అణచివేసేందుకు చేస్తున్న మిలిటరీ దాడులకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
దీంట్లో భాగంగానే గత మంగళవారం ఉదయం 11 గంటలకు 50 మంది సైనికులు డన్ టావ్ గ్రామంలోకి ప్రవేశించారు. ఎవరూ పారిపోకుండా అన్ని దారులను మూసివేశారు. 11 మంది అమాయక పౌరులను పట్టుకున్నారు. వారి చేతులను వెనక్కి కట్టేసి, నిప్పు అంటించి సజీవంగా దహనం చేశారు. ఇస్లామిక్ స్టేక్ ఉగ్రవాదుల క్రూరత్వాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని మీడియా పేర్కొంది.మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి పలు మానవ హక్కుల సంఘాలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa