ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లో గడచిన 24 గంటల్లో కొత్తగా 142 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 10, 2021, 06:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 142 కరోనా కేసులు నమోదై నాయి.  ఇద్దరు మృతి చెందారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… కరోనా మహమ్మారి కారణంగా చిత్తూరు మరియు కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇక గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 188 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 32, 793 కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ.
దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షలు సంఖ్య 3,07, 15,406 కు చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 144 42 మంది మరణించారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1989 కరోనా యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా మహమ్మారి కేసుల సంఖ్య 2074552 కు చేరుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa