కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. నగరంలో గత కొద్దిరోజుల నుండి వరుస దొంగతనాలు జరుగుతున్న సంఘటన కలకలం రేపుతుంది. నగరంలో తాజాగా మరో దొంగతనం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. బెజవాడలోని ఎంజీ రోడ్డులో ఆట్టిక గోల్డ్ షాపులో చోరీకి తెగబడ్డ దుండగులు... దాదాపు 60 లక్ష నగదు, భారీగా బంగారాన్ని అపహరించారు.
అయితే ఇంటి దొంగలా లేకపోతే బయట దొంగల పనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే నగరంలో చెడ్డి దొంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. బ్రాంచ్ మేనేజర్, మరో ఉద్యోగి నిన్నటి నుండి సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa