ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ లో దీక్ష విరమించిన పవన్.. జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 12, 2021, 06:06 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నేడు స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా 7 గంటల పటు సంఘీభావ దీక్ష చేసారు. ఆ దీక్షను పార్టీ నాయకులూ నిమ్మరసం ఇచ్చి  విరమింప చేసారు. దీక్ష అనంతరం పవన్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పు 22 వేల  కోట్లు. అప్పుంటే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారా..?అయితే ఏపీ కి 6 లక్షల కోట్లు అప్పు ఉంది.. ఇక ఏపీ పరిస్థితి ఏంటని నిలదీశారు.. ప్రజలు జనసేనకు ఓటు వేయక పోయిన ప్రజలు కష్టాల్లో ఉంటె జనసేన ప్రజల కొరకు ప్రజల వైపు నిలబడుతుందని పవన్ తెలిపారు. దామోదరం సంజీవయ్య గారికి చిన్న స్మారక కూడా కట్టలేని ఏపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర , రాయలసీమ గురించి ఎం మాట్లాడుతుందని ఎద్దేవా చేసారు. ఏపీ అఖిల పక్షం అంత వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలని జనసేనాని డిమాండ్ చేసారు. ప్రజలకు కష్టాలు వస్తేనే జనసేన పార్టీ గుర్తొస్తుంది, ఓట్లు వేసేప్పుడు మాత్రం జనసేన పార్టీ గుర్తుకు రాదని ప్రజల పై పవన్ మండి పడ్డారు. ఏపీ ఎంపీలు ఉన్నది టీ , కాఫీలు తాగడానికే.?వాళ్ళు కేంద్రాన్ని ఏమి అడగరా? సినిమా టిక్కెట్ల విషయంలో పారదర్శకత లేదంటారు.. ఏపీ ప్రభుత్వం అమ్మే మద్యంలో పారదరసాకత ఉందా అంటూ నిలదీశారు. అవసరమైతే ఏపీ ఉచితంగా ఏపీ లో సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తా గాని వారికి వీరికి భయపడే ప్రసక్తే లేదని పవన్ కౌంటర్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa