ప్రకాశం జిల్లాలో ఓ ఎక్స్ప్రెస్ రైలులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన యువతిని కొందరు ఉత్తరాది యువకులు వేధింపులకు గురిచేశారు. వారి చేష్టలను భరించలేని యువతి అవమానంతో రైలు నుంచి కిందికి దూకింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్ మీదుగా కన్యాకుమారి- నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలు వేగంగా వెళుతోంది. చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ముగ్గురు యువతులు విజయవాడ వెళ్లేందుకు చెన్నైలో రైలు ఎక్కారు. తమకు రిజర్వేషన్ లేకపోవడంతో ఎస్-1 బోగీలో ఎక్కారు. బోగీలో ఎక్కడా ఖాళీ లేకపోవడంతో నిలబడి ప్రయాణం చేస్తున్నారు. ఒంటరిగా ప్రయాణిస్తున్నారని గమనించిన ఇద్దరు పోకిరీలు వీరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించారు. పైపైకి వస్తుండడంతో యువతులు బోగీలో ఉన్న ఇతర ప్రయాణికుల సాయం అడిగారు. అంతా ఉత్తరాది ప్రాంతానికి చెందిన యువకులు ఉండడంతో వారికి సాయపడేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో సింగరాయకొండ దగ్గరకు రాగానే కదిలే రైలు నుంచి అందులోని ఓ యువతి ఫ్లాట్ఫాంపైకి దూకింది. తమ స్నేహితురాలు దూకేయడంతో ఆమె ఇద్దరు స్నేహితురాళ్లు రైలు చైన్ లాగారు. అప్పటికే తీవ్ర గాయాలపాలైన స్నేహితురాలిని 108 వాహనంలో ఒంగోకు రిమ్స్కు తరలించారు. గాయపడిన యువతికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని, నిందితులను పట్టుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa